జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్​కు పాల్గొనే ఛాన్స్ లేనట్టేనా..?

-

భారత్‌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఈ సదస్సుకు హాజరయ్యే జాబితాలో ఉక్రెయిన్‌ లేకపోవడం గమనార్హం. ఆ సమావేశాలకు ఏయే దేశాలను ఆహ్వానిస్తున్నామన్నది ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని మన దేశం తాజాగా గుర్తుచేసింది.

జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించే అవకాశం లభిస్తే జెలెన్‌స్కీ చాలా సంతోషిస్తారంటూ ఉక్రెయిన్‌ ఫస్ట్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమైన్‌ జపరోవా దిల్లీలో మంగళవారం వ్యాఖ్యానించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీని ఈ వ్యాఖ్యలపై దిల్లీలో విలేకర్లు గురువారం ప్రశ్నించారు. దీంతో బాగ్చీ స్పందిస్తూ.. ‘‘జీ-20 సదస్సుకు ఎవరెవర్ని ఆహ్వానిస్తున్నామో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా గతంలోనే నిర్దిష్టంగా తెలియజేశారు. ‘ఆ జాబితాను విలేకర్లకు అందజేశాం కూడా. అందులో ప్రస్తుతం మేము మార్పులేవీ చేయలేదు’’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news