కరోనా ఉన్నా సరే కుంభమేళా జరుగుతుంది: సిఎం

-

కరోనా వైరస్ కారణంగా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, కుంభమేళా వచ్చే ఏడాది హరిద్వార్‌ లో నిర్వహిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారం ప్రకటించారు. జనవరి 14 న ప్రారంభం కానున్న 2021 కుంభమేళా సన్నాహాలకు సంబంధించి ఆదివారం అఖిల్ భారతీయ అఖాదా పరిషత్ (ఎబిఎపి) కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో సిఎం రావత్ హాజరయ్యారు.Uttarakhand: CM Trivendra Singh Rawat says state will make rape of minors punishable by death

అయితే కుంభమేళా యొక్క పరిధి అనేది ఆ సమయంలో కరోనా తీవ్రత ఆధారంగా ఉంటుంది. ప్రయత్నాలు భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవటాన్ని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని ఆయన స్పష్టం చేసారు. కుంభమేళా పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 15 రోజుల్లో పరిస్థితికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆయన ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news