వారణాసిలో పెద్దగా ప్రచారం అవసరం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్

-

వారణాసిలో బీజేపీ పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.  వారణాసిలో మరోసారి మోదీ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసిన మోదీ జయకేతనం ఎగురవేశారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని చూసి ప్రజలు గర్విస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా చివరి విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాల్లో 7వ విడతలో భాగంగా జూన్ 01న పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత జూన్ 04న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news