పాదయాత్ర తొలిరోజే పీకేకు షాక్.. జనం లేక బోసిపోయిన సభా ప్రాంగణం

-

ప్రశాంత్ కిశోర్.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త. జనం నాడిని అంచనా వేయడం, ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేలా, ప్రజల మెప్పు పొందేలా ప్రచార వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట అని చెబుతుంటాయి రాజకీయ వర్గాలు. అలాంటి ఆయన తన పార్టీ అయిన జన సురాజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.

ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర పార్టీల కోసం వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన పీకేకు తొలిరోజే నిరాశ ఎదురైంది. తన భారీ బహిరంగ సభకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారన్నది స్థానికుల మాట.

రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి వరకు తెరవెనుక ఉండి పనిచేసిన పీకే.. ఇప్పుడు నేరుగా కదన రంగంలోకి దిగారు. స్వరాష్ట్రం బిహార్​లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జన సురాజ్ పేరిట ఆ రాష్ట్రంలో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. పీకే పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news