రోహిత్ కోహ్లీ మధ్య మాటల్లేవ్.. నిజం బయటపడింది..!

-

గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో రోహిత్ శర్మ గాయం గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గాయం గురించి స్పందిస్తూ రోహిత్ శర్మ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదని అసలు క్లారిటీ లేదు అంటూ సమాధానం ఇవ్వడం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సమాధానం పై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరి మధ్య కూడా మాటలు లేవు అన్నది విరాట్ కోహ్లీ వ్యాఖ్యలతో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడి ఉండాల్సిందని లేదా బీసీసీఐ… లేదా కోచ్ రావిశాస్త్రి అయినా వీరిద్దరి మధ్య మాటలు ఉండేవిధంగా ప్రయత్నించాల్సి ఉండాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ గాయంపై బిసిసిఐ క్లారిటీ ఇవ్వడం లేదు అంటూ వ్యాఖ్యానించారు ఆశిష్ నెహ్రా.

Read more RELATED
Recommended to you

Latest news