ధర్మపురి అరవింద్ కు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ !

-

భారతీయ జనతా పార్టీ నాయకులు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. ధర్మపురి అరవింద్ కు నాంపల్లి కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. గతంలో అంటే 2020 నవంబర్ 23 వ తేదీన కెబిఆర్ పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కోడింగ్ లను ఎంపీ అరవింద్ మరియు ఆయన అనుచరులు చింపి వేశారు అంటూ కేసు నమోదు అయింది.

అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడారని అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ కూడా వేశారు.

ఇక ఈ కేసును ఇవాళ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. అయితే ఇవాళ తప్పనిసరిగా కేసు విచారణకు హాజరు కావాల్సినప్పటికీ..ధర్మపురి అరవింద్ హాజరు కాలేక పోయాడు. దీంతో ఆగ్రహం గురైన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు… ధర్మపురి అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఈ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news