కలలో కూడా కెసిఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదు – ఎంపీ రఘురామ

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు తెలంగాణ సీట్ నోటీసులు అందాయని తెలిపారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29వ తేదీన బంజారాహిల్స్ లోని సీట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలిపారు.

అయితే ప్రజా జీవితంలో ఉన్నందువల్ల ఎవరితోనైనా ఫోటోలు దిగాల్సి ఉంటుందన్న ఆయన.. సీఎం జగన్ 32 కేసులలో 420 గా ఉన్నారని, ఆయనతో ఫోటోలో 150 మంది ఎమ్మెల్యేలు ఉంటారని అంత మాత్రాన అందరూ నేరస్తులు కారని తెలిపారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని ఎన్నో సందర్భాలలో చెప్పానని, కలలో కూడా సీఎం కేసీఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news