BJP: బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల..పోటీలో ఉంది వీళ్ళే

-

ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది.. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

bjp
bjp

రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు స్క్రూటినీ చేస్తారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఎల్లుండి ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సమయం దగ్గరపడిన తరుణంలో ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, డాక్టర్‌ పార్థ సారథి, మాజీ ఎమ్మెల్యే మాధవ్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news