హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా NSUI తెలంగాణ అధ్యక్షుడు !

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగా.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. ఇక అటు అధికార పార్టీ టిఆర్ఎస్ మరియు జనతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే సి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అయితే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై… మొదటి నుంచి సందిగ్దత నెలకొంది సంగతి తెలిసిందే. హుజరాబాద్ నియోజకవర్గం షెడ్యూల్ విడుదల అయినప్పటికీ కూడా… అభ్యర్థిని ప్రకటించడంలో నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. మొదట్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారని ప్రచారం సాగగా… ఆ తర్వాత కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది.

అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు కొండా సురేఖ నో చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థి వేటలో పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కు చెందిన బాలమురళి వెంకట్ ను హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సాయంత్రంలోగా అధికారిక ప్రకటన చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news