ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపుకి రెడీ అయిన పోలీసులు

-

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల తొలగింపు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. విగ్రహాల తొలగింపు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను రాష్ట్రంలో లేకుండా చేయాలని చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వినుకొండ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపుకు రంగం సిద్దం చేసారు.

దీనితో ఇప్పుడు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కు దిగిన మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు… ఎలాంటి పరిస్థితిలోను అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీనితో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించిన పోలీసులు… భారీగా బలగాలు మొహరించాయి. ఈ రాత్రికి విగ్రహాలు తొలగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news