శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకి రిమాండ్

-

నూతన్ నాయుడి ఇంట్లో జరిగిన శిరోముండనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అతని ఇంట్లో పని చేసే శ్రీకాంత్ అనే యువకుడు పని మానేశాడనే కోపంతో అతన్ని ఇంటికి పిలిపించి మరీ గుండు కొట్టించారు. ఈ విషయం సంచలనంగా మారడంతో పోలీసులు నూతన్ నాయుడు భార్య సహా గుండు కొట్టించిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈయన తప్పించుకు పోవాలని చూశాడు. ముంబై పారిపోతుండగా కర్నాటక రాష్ట్రం ఉడిపిలో పట్టుకున్న పోలీసులు విశాఖకు తరలించారు.

వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. శిరోముండనం కేసులో అతడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. శిరోముండనం చేసే ముందు, తర్వాత నూతన్‌నాయుడితో ఆయన భార్య మాట్లాడింది. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే శిరోముండనం జరిగింది. ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇక ఈ శిరోముండనం కేసులో నూతన్ నాయుడికి ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news