మరి కాసేపట్లో మీలో ఎవరు కోటీశ్వరులు అఫీషియల్ అనౌన్స్ మెంట్ !

-

 ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఒక టెలివిజన్ షో చేస్తున్నాడనే ప్రహ్చారం జరుగుతోంది. దాని మీద ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. గతంలో కింగ్ నాగార్జున హోస్ట్‌ గా రూపొందిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే షోకి సెకండ్ సీజన్ ని టైటిల్ మార్చి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులుగా మార్చి జెమినీ టీవీ స‌రికొత్త షో ప్లాన్ చేసింది.

ఈ  షోనే ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. మొన్ననే టీజర్ కూడా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని పూర్తిగా రివీల్ చేయ‌కుండా, షాడో లా చూపించారు. దీనికి సంబంధించి నేడు అధికారిక ప్రకటన ఉండనుంది. ఇప్పటికే మీడియాకి ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ లో కార్యక్రమం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news