మార్చి 3 న (ఆదివారం) పల్స్ పోలియో..

-

పల్స్ పోలియో కార్యక్రమం దేశ వ్యాప్తంగా మార్చి 3న జరగనుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ ఆదివారం (మార్చి 3 )నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది.పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ని అందించడానికి వాలంటీర్లకు శిక్షణనిస్తున్నారు.తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా బాధ్యాతయుతంగా పిల్లలను దగ్గర్లోని కేంద్రాలకు తీసుకెళ్లి తప్పకుండా ఆదివారం(మార్చి 3న) చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించండి.

ఒక వేళ మార్చి 3 న మర్చిపోతే 4,5 తేదీల్లో ఆయా గ్రామాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఒక వేళ పోలియో చుక్కలు పిల్లలకు వేపించకుంటే తరచూ జ్వరాలు రావడం అది మెదడుకు పాకి ఇబ్బందికరంగా మారి నరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ పోలియో వ్యాది నివారణకు టీకా తప్పా మరొకటి లేదు కావున పోలియో చుక్కలు వేయించాలని డాక్టరల్లు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news