మరోసారి సోషల్ మీడియాలో ట్రొల్ అవుతున్న అనసూయ..!!

-

ఇప్పుడు వున్న తెలుగు యాంకర్స్ లో అనసూయ రూటే సెపరేటు. గ్లామర్ ఫీల్డ్ లో వయస్సు పెరిగితే ఫేడ్ అవుట్ అవుతారు. కాని అనసూయ అందం పెరుగుతూ వస్తోంది. అలాగే స్కిన్ షో విషయం లో కూడా ఆమె ఎక్కడా తగ్గటం లేదు. సాధారణంగా టీవీ, సినిమా రంగంలో వున్న వారిపై నెటిజన్స్ అప్పుడప్పుడు విమర్శించడం మామూలే. సాధారణంగా చాలామంది వీటిని అస్సలు పట్టించుకోరు.కాని అనసూయ మాత్రం దెబ్బకు దెబ్బ అనే టైప్ లో తనపై వచ్చిన ప్రతి నెగిటివ్ కామెంట్ తగ్గకుండా రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

గతంలో నెటిజన్స్ “అంటీ” అన్నప్పుడు వారితో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకొని, పోలీస్ కేసుల దాకా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నో కామెడీలు మీమ్స్ వచ్చాయి.అలాగే సుమ లాంటి వారు ఆమెకు క్లాస్ పీకటం కూడా జరిగింది. ఈ రచ్చను అందరూ మరిచి పోతున్న సమయంలో మళ్లీ తనదైన కామెంట్స్ తో కయ్యానికి కాలు దువ్వుతూ వుంది.ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కు అనసూయ హాజరు కాలేదు. దీనిపై  సోషల్ మీడియాలో కొంతమంది  ట్రోల్ చేసారు.

దీనికి మిగిలిన వాళ్ళు మనకెందుకులే  అనుకుంటారు. కాని అనసూయ మాత్రం నేను ఏదన్నా అంటే ఫీలవుతారు, నన్ను ఎందుకు కెలుకుతారు అంటూ అయ్యో పిచ్చి క్యూటీస్ అనే పదం వాడింది. దీనికి మీ ఐగో హర్ట్ అయ్యి మళ్లీ కామెంట్స్ తో దాడి చేస్తారా అని కవ్వించింది. మీకు నాపై అంత ఇష్టం ఉండి , ఖాళీగా వుంటే మీ ఇష్టం అని ట్వీట్ చేసింది. దీనితో మరోసారి సోషల్ మీడియాలో ఆమె మీద దాడి మొదలయ్యింది.అనసూయ ఈ పిచ్చి విషయాల గురించి పట్టించు కోవడం మానేస్తే చాలా బెటర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాని అనసూయ మాత్రం ఇలా ఉంటేనే ట్రెండింగ్ వుంటానని అనుకుంటుందేమో తెలియదు కాని, ఇది ఆమె కెరియర్ కు ఇబ్బందికరం గా మారే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news