బ్రేకింగ్ : ఏపీలో కూడా కొత్త కరోన కేసు.. ఎక్కడంటే ?

-

ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోన్న యూకే కరోనా స్ట్రెయిన్ ఏపీలోనూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి దాకా యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ 11 మంది వీరి కరోనా టెస్టింగ్ శాంపిల్స్ ని పుణెలోని వైరాలజీ ల్యాబ్, హైదరాబాద్ లోని సీసీఎంబీకి టెస్టింగ్ కోసం పంపారు. ఆ పరీక్షా ఫలితాలలో 11 కరోనా పాజిటీవ్ కేసుల్లో ఒకరికి యూకే స్ట్రెయిన్ కలిగిన కరోనాగా నిర్దారణ అయింది.

రాజమండ్రికి చెందిన యూకే రిటర్నీకి యూకే కరోనా సోకినట్టు గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయితే మిగిలిన 10 మందిలో యూకే స్ట్రెయిన్ ఆనవాళ్లు కనిపించక పోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు 1324 మంది క్వారంటైన్ లో ఉన్నారని వారికి కాంటాక్ట్ లు అయిన 5,784 మందిని గుర్తించి వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news