ఆన్‌లైన్‌లో అమ్మాయిల దందా..తెలుగు రాష్ట్రాల్లో సెక్స్‌ రాకెట్‌ సాగుతుందిలా

-

తెలుగు రాష్ట్రాల్లో సెక్స్‌ రాకెట్‌ దూసుకుపోతోంది. పోలీసులు ఎన్ని సార్లు సెక్స్‌ రాకెట్‌ పని పట్టినా..మళ్లీ మళ్లీ అది జోరుమీద సాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా.. ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్‌ ముఠా ఆటకట్టించారు ఏపీ పోలీసులు.. ఇటు హైదరాబాద్‌లోనూ హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్.

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. విటులకు ధమ్‌ బిరియాని విత్‌ ఎక్స్‌ట్రా పీసెస్. నామినల్‌ ఫీజు కడితే చాలు ఫుల్‌ మీల్స్‌.. ఇదీ హైటెక్‌ సెక్స్‌ రాకెట్ స్పెషల్‌ ఆఫర్స్.. ఏపీలో తెలంగాణలో ఇప్పుడు జోరుమీదున్నాయి. జోష్‌తో చెలరేగిపోతున్నాయి. ఆన్‌లైన్‌‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో.. విశాఖతో పాటూ పలుచోట్ల సీఐడీ అధికారులు దాడులు జరిపారు. అయితే ఈ ముఠాల గురించి ఆరా తీసిన అధికారులే షాకయ్యేంత పనయ్యింది. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్ నుంచి యువతుల్ని తీసుకొచ్చి విశాఖలో వ్యభిచారం చేయిస్తున్నారు. విశాఖలోని ఓ వ్యక్తిపై నిఘా పెట్టగా ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చినట్లుగా తేలింది.

ఇక హైదరాబాద్‌లో కూడా హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ జామ్ జామ్మంటూ సాగుతోంది. ఆన్‌లైన్‌లోనే బంపర్‌ ఆఫర్స్‌ కూడా పెడుతున్నారంట. మనీని బట్టి మజా అన్నట్లు.. విటులు ఎంతిస్తే.. ఎంత ఆనందం పంచుతామని చెబుతున్నారంట. అందుకే పూట పూట రేటుకు తగినట్లు జల్సా చేయాలనుకునేవాళ్లు ఎంత సమర్పించుకుంటే అంత సంబరాలు దక్కుతాయని చెబుతున్నారంట. అందుకే ఆన్‌లైన్‌లో అమ్మాయిలు కూడా విటులు కోరినంత ఆనందాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారంట. ఈ కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవడమంటే ఇదేనేమో మరి..పెట్టిన సొమ్ముకు అధిక రాబడి అన్నట్లు..విటులంతా ఇప్పుడు ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లోనే తచ్చాడుతున్నారంట.

ఎక్కడ ఎవరైనా ముద్దుగా బొద్దుగా కనిపించినా..సెక్స్‌ రాకెట్‌ నిర్వాహకుల కాంటాక్ట్‌ నెంబర్లు కనిపించినా.. వెంటనే పట్టేసుకుంటున్నారంట. అందుకే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెక్స్‌ రాకెట్ యమ స్పీడులో దూసుకుపోతోంది.

నిరుద్యోగంలో ఉన్న యువతులను వీళ్ల టార్గెట్. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వస్తున్న యువతులను వ్యభిచార వృత్తిలోకి లాగుతారు.. పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తామంటూ నమ్మిస్తారు..అంతేకాకుండా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పేరుతో మోసం చేస్తున్నారు. ఇలా, హైదరాబాద్ వచ్చిన యువతులు సెక్స్ రాకెట్ మాఫియా చేతిలో పడిపోతున్నారు.. ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకున్న కేసులో ఇలాంటి వాళ్లే ఎక్కువమంది ఉన్నారు..

వీళ్లదంతా ఓ గ్రూప్‌.. రాష్ట్రానికి ఒకరు ఇద్దరు చొప్పున టీమ్‌లుగా ఏర్పడతారు. పల్లెపల్లెకూ తిరుగుతారు. పూట గడవటం కూడా కష్టంగా ఉన్న కుటుంబాలను పట్టుకుంటారు. వాళ్ల ఇళ్లలో ఉన్న అమ్మాయిలను ఉపాధి పేరుతో నగరాలకు తీసుకొస్తారు. ఆ తర్వాత వాళ్లను దేశమంతా తిప్పుతారు. ఇలా గ్యాంగులుగా ఏర్పడి సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నారు.

ఉపాధి పేరుతో మాయమాటలు చెప్పి, ఢిల్లీ, కోల్‌కత, ముంబయ్‌, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల నుంచి అమ్మాయిలను పిలిపిస్తున్నారు. ఆన్‌లైన్లో వ్యభిచారం చేయిస్తున్నారు. వాళ్లు కూడా సొంతూళ్లకు పోలేక..ఇంటికెళ్లి ఉండలేక..డబ్బు అవసరాలకు కాదనలేక.. తప్పించుకుందామన్నా వీలుకాక తప్పనిసరి పరిస్థితుల్లో చేయకూడని పని చేస్తూ.. ఇలా బలైపోతున్నారు. పోలీసుల చేతికి చిక్కుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news