కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ తీర్థం

-

తెరాస అధినేత కేసీఆర్ ని ఓడించడమే తన లక్ష్యమని గజ్వేల్ సాక్షిగా కేసీఆర్ పై పోటీచేసిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి కారెక్కేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం కేసీఆర్  సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అయితే గతంలో ఎన్నికల సమయంలో అనేక సార్లు కేసీఆర్ తనకు బద్దశత్రువు అని ప్రకటించిన వంటేరు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీవైపు చూడటం శోచనీయం. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై ఆయన 19 వేల ఓట్లతో ఓడిపోయిన వంటేరు.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెంట్ తో కాంగ్రెస్ కి తిరుగులేదంటూ నోటికొచ్చినట్లు తెరాస ను తిట్టి చివరికి గులాబీ గాలీలో కొట్టుకుపోయారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను ఓడించాలంటూ మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశారని చెప్పారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్ నాయకులు తనపై దాడులు చేస్తున్నారని, ప్రాణ భయం ఉందని ఆందోళనకు దిగారు. అలాంటి వంటేరు నేడు కేసీఆర్ పై విశ్వాసంతో తెరాసలో చేరేందుకు ఆసక్తి చూపడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news