చికెన్ రేట్ డౌన్… పాపం తెలుగు రాష్ట్రాలు…?

-

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని పాంగ్ డ్యామ్ సరస్సు వద్ద వలస వచ్చిన పక్షులు పక్షుల ఫ్లూ బారిన పడ్డాయని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇటీవలి రోజుల్లో భయంకరమైన ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులను నివేదించిన నాల్గవ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రసిద్ధ పాంగ్ డ్యామ్ అభయారణ్యంలో 1700 కు పైగా వలస పక్షులు అనూహ్యంగా మరణం భారిన పడ్డాయి.

బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ప్రయోగశాల చనిపోయిన పక్షుల నమూనాలలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను గుర్తించిందని, కేంద్రం అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) అర్చన శర్మ తెలిపారు. ఇటీవలి రోజుల్లో, రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ హెచ్చరిక వినిపించింది, ఇక్కడ అర డజను జిల్లాల్లో 250 కి పైగా కాకులు చనిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ కేసులు కూడా నిర్ధారించారు.

దీనితో ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే… కరోనా దెబ్బకు మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్, లైవ్ కోడి రేటు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. చికెన్ రేట్ అప్పుడు 20 రూపాయల వరకు పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా రేటు పడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. దీనితో కోడి పిల్లలు దింపుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news