రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ భారీ స్కోర్ చేసిన టీమిండియా

-

ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రుగుతున్న టీ 20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల ను న‌ష్ట పోయి 210 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, కెఎల్ రాహుల్ దాటీ గా ఆడ‌టం తో టీమిండియా భారీ స్కోర్ సాధించక‌లిగింది. ప్ర‌త్య‌ర్థి ఆఫ్ఘ‌నిస్తాన్ ముందు 211 పరుగుల టార్గెట్ ఉంచుంది. అయితే రెండు మ్యాచ్‌ల లో తీవ్రంగా విఫ‌లం అయిన బ్యాట‌ర్ లు అంద‌రూ కూడా ఈ మ్యాచ్ లో చ‌క్క‌గా రాణించారు. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ 74 (47) చేశాడు.

అందులో 8 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అలాగే మ‌రొక ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ 69(48) ప‌రుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. వీరి తో పాటు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ 3 సిక్స్ లు 1 ఫోర్ బాది 27(13), హ‌ర్ధిక్ పాండ్య 2 సిక్స్ లు, 4 ఫోర్లు 35 (13) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌టంతో టీమిండియా భారీ స్కోర్ చేయ‌గ‌లికింది.

Read more RELATED
Recommended to you

Latest news