తప్పు అంగీకరించినా శిక్ష విధించని కోర్టు… ఎందుకంటే?

-

సాధారణంగా ఎవరైనా తప్పు చేశామని అంగీకరిస్తే కోర్టులో ఆ వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. దోషి అని తేలితే కోర్టు తప్పనిసరిగా నేరాన్ని బట్టి శిక్ష వేస్తుంది. అయితే ఒక వ్యక్తి తప్పు చేసినట్టు అంగీకరించినా కోర్టు ఆ వ్యక్తికి మాత్రం శిక్ష విధించలేదు. కోర్టులో సాక్ష్యాధారాలు సైతం అతనికి వ్యతిరేకంగా ఉన్నా శిక్షించడానికి కోర్టు అంగీకరించలేదు. కోర్టు ఆ వ్యక్తికి శిక్ష విధించకపోవడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా అనే ప్రాంతంలో పీటన్ జాన్ వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవాడు. పవిత్రమైన గురువు స్థానంలో ఉన్న ఆ వ్యక్తి విద్యార్థినులను, ఉపాధ్యాయినిలను లైంగికంగా వేధించేవాడు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో సాధారణ బరువుతోనే ఉన్న ఆ వ్యక్తి కోర్టు విచారణ సమయంలో కదలలేనంత లావయ్యాడు. ఆ వ్యక్తికి కోర్టు శిక్ష విధిస్తే భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో పాటు స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంది.

అలా అని చెప్పి శిక్ష విధించకపోతే కోర్టుకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దోషి కూర్చున్న చోటు నుంచి కదలలేని విధంగా ఉండటంతో అతనికి కొన్ని రోజుల తరువాత ఎలాంటి శిక్ష విధించాలనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. పీటన్ జాన్ తక్కువ సమయంలోనే బరువు పెరగడం వల్ల అతను కూర్చున్న చోటు నుంచి కదలలేక పోతున్నా అదే సమయంలో కోర్టు శిక్ష నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news