పెళ్ళికి వెళ్లి పెళ్లి కూతురి నగలే కొట్టేశారు !

-

మన వాళ్ళు కదా అని పెళ్ళికి పిలిచారు. కానీ వాళ్లు దొంగలు అన్న సంగతి తెలీదు. సైలెంట్ గా వచ్చారు, తమ చేతికి పని చెప్పారు. అయితే ఆ నగలలో పెళ్లి కూతురి నగలు కూడా ఉండడంతో కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో జరిగిన పెళ్లిలో చోరీ జరిగింది. అది కూడా పెండ్లి కుమార్తె, ఆమె బంధువులకు సంబంధించిన  మూడు తులాల బంగారాన్ని ఒక జంట దొంగిలించింది.

thief
thief

 

వీళ్ళు దొంగతనం చేయడం గమనించి బంగారం దొంగిలించిన దంపతులను పెళ్లికి హాజరైన వారు పట్టుకున్నారు. బంగారం దొంగిలించిన దంపతులను చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరా నగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు. పోలీసులు సొత్తు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు

Read more RELATED
Recommended to you

Latest news