వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకులకు నో ఎంట్రీ …. !

-

క్రికెట్ ప్రేక్షకులకు మరో రెండు వారాలలో ప్రపంచ కప్ తో ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండనుంది. అధికారికంగా అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 19వ తేదీ వరకు ఈ వరల్డ్ కప్ జరగనుండగా మొత్తం 10 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ టోర్నెలో ఫేవరెట్ గా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లు ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న హైదరాబాద్ లో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ను చూడడానికి బీసీసీఐ ప్రేక్షకులకు అనుమతిని నిరాకరించిందట. అదే రోజున హైద్రాబాద్ లో గణేశుని నిమజ్జనం కార్యక్రమాలు భారీ ఎత్తున జరగనున్నాయి. అందుకే భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆ రోజున స్టేడియం ను మూసివేస్తున్నారు.

అందుకే ఈ మ్యాచ్ ను చూడడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. ఎటువంటి ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news