బండి సంజయ్..నువో కుక్క, నూకలు చెల్లాయి బిడ్డా – పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

-

బండి సంజయ్..నువో కుక్క, నూకలు చెల్లాయి బిడ్డా అని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధ పురం లో ODCMS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి 10వేల రూపాయల చొప్పున గత ఏడు సీజన్లో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం టిఆర్ఎస్ అని.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని ఆగ్రహించారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెట్టిందని… బండి సంజయ్ బండి కింద కుక్క లాగా నేనే మొత్తం కెసిఆర్ తో వడ్లు కొనే విధంగా చేసిన అని చెప్పుకుంటున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మోడీ దగ్గర జి హుజూర్ అనకుండా ఎండాకాలంలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పు… వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోవైపు బిజెపి పార్టీలు జిమ్మిక్కులు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంపశయ్య మీద భీష్ముని లాగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని.. గాంధీని తిడుతూ గాడ్సేను పొగుడుతున్నారని బిజెపి నాయకులపై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news