PALLAVI PRASHANTH : బెయిల్ మీద బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్

-

బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రశాంత్ ఫ్యాన్స్ అల్లర్లు చేయడంతో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలకొట్టారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడా జైల్ కి తరలించారు.

తాజాగా నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి బయటకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ను ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించినది.బిగ్బాస్ అన్ని సీజన్లో కెల్లా ఈ సీజన్ హైలైట్ గా నిలిచింది. ఒక రైతు బిడ్డ విజేతగా నిలవడం ఒక ఎత్తు అయితే అతడు బయటికి వచ్చి అరెస్టు కావడం మరో ఎత్తు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news