డైరెక్టర్ మోహన్ రాజాకు ఆ పాన్ ఇండియా హీరో ఒకే చెప్పాడా..!!

-

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్  సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి తో చాలా రోజులు కూర్చోని ఆయన అడిగినన్ని మార్పులు ఏమాత్రం విసుగు లేకుండా ఓపిక తో చేసుకుంటూ వచ్చారు. అసలే లేక లేక వచ్చిన అవకాశం అది కూడా మెగాస్టార్ చిరంజీవి తో అయ్యే సరికి తాను చాలా ఆనంద పడ్డాడు.

తన కెరియర్ మరో లెవల్లో ఉండబోతుంది అని కలలు కన్నాడు. తీరా ఆ కలలన్నీ కల్లలు అయ్యేలే ప్రస్తుత పరిస్థితి ఉందట.తాను అనుకున్నవిధంగా ‘గాడ్ ఫాదర్’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో ఆగి పోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు చాలా మంది మోహన్ రాజా కు నెక్స్ట్ సినిమా చేయాలని అడిగారట.

ఇప్పుడు మోహన్ రాజా తో సినిమా చేసే విషయంలో నాగార్జున ఆలోచనలో పడ్డారని వార్తలు వనిపిస్తున్నాయి. దానితో మోహన్ రాజా రీసెంట్ గ పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టిన హీరో కు కథ చెప్పి ఒకే చెప్పించుకు కున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news