ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు – వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

-

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనించలేకపోయారని అన్నారు. రాజకీయాలలో ఎన్టీఆర్ బోలా మనిషి అన్నారు వెంకయ్య.

అందుకే వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలలో ఓ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఆడపడుచులను ఆదరించి రాజకీయాలలోకి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. సిద్ధాంతాలు వేరైనప్పటికీ పద్ధతులు పాటించేవారు అంటే తనకు గౌరవం అని చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు. ఎన్టీఆర్ స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news