ఏపీ బీజేపీ సీనియర్ నేత మృతి

-

బీజేపీ నేత, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు. తన స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో నిన్న రాత్రి సుబ్బయ్య మరణించారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పని చేసిన సుబ్బయ్య ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు.

గత ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ నుండి బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి మూడు సార్లు పోటీ చేసి గెలిచిన పట్నం సుబ్బయ్య దివంగత సీఎం ఎన్టీఆర్‌తో పాటు  చంద్రబాబు హయాంలో కూడా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news