నేనంటే ఏమిటో చూపిస్తా…పవన్

-

రం దాటేశాక తెడ్డు తగలేసినట్లు తెదేపా నేతల వ్యవహార శైలి ఉందంటూ జనసేన అధినత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో విజయనగరం జిల్లా జనసేన నేతలతో ఆదివారం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘కేవలం ఇద్దరు వ్యక్తులు జిల్లాను శాసిస్తున్నారన్నారు. వారిలో ఓ వ్యక్తి  తెదేపా నేత అశోక్ గజపతి రాజు.. గత ఎన్నికల్లో ఆయన  విజయం కోసం ప్రచారం చేస్తే ఇప్పుడేమో అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. పైగా  పవన్ సినిమా నటుడు అన్నారు. ఈ విషయమై స్పందించిన పవన్..త్వరలోనే తానెవ్వరో అలాంటి వారందరికి తెలియజేస్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి నేను యాదృచ్ఛికంగా నటుడ్ని అయ్యాను. ఎన్ని విమర్శలు చేసినా ముందుకు సాగిపోయే స్వభావం నాది.

నా మానసిక పరిస్థితి రాజకీయాలకు మాత్రమే సెట్ అవుతుంది. నన్ను అన్ని కులాల వారు ఆదరిస్తేనే నేను ఇంతటి వాడినయ్యాను. 2009 నుంచి 2019 వరకు మూడు ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని జనసైనికులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news