పవన్ కళ్యాణ్ ప్రయత్నం అంతా టిడిపిని బ్రతికించేందుకే – మంత్రి కొట్టు సత్యనారాయణ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నం అంతా టిడిపి పార్టీని బ్రతికించేందుకేనని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన నేతలు అసహనంతో ఉన్నారని, రూల్స్ అంటే వారికి లెక్క లేదని విమర్శించారు. చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ విశాఖలో హంగామా చేస్తున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోయిందని మండిపడ్డారు. డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా అంత హిట్ అవుతుందనే ఫార్ములా తో రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని అన్నారు.

తనకోసం కాకుండా అంపశయ్యపై ఉన్నన టిడిపిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇదిలా ఉంటే మరోవైపు పథకం ప్రకారమే విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేశారని అన్నారు నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్. ఈనెల 13వ తేదీన జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కోన తాతారావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను డిసిపికి లేఖ ఇచ్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news