భక్తులకు శుభవార్త..యాదాద్రిలో త్వరలో వీవీఐపీ, వీఐపీలకు బ్రేక్‌ దర్శనాలు

-

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త. తిరుమలలో మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, త్వరలో వివిఐపి, వీఐపీ లకు బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

యాదాద్రి ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం ద్వారా ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన వెలుపలి ప్రాకార మండపంలో బ్రేక్ దర్శనానికి క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news