మేమేమన్నా గూండాలమా.. మమ్మల్ని ఆపడానికి మీరెవరు : పవన్ కల్యాణ్

-

ఉద్రిక్తతల నడుమ జనసేనాని పవన్‌ కల్యాణ్ ఇప్పటం చేరుకున్నారు. కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శిస్తున్నారు. మార్గమధ్యలో పోలీసులు పవన్​ను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పవన్ కొద్ది దూరం నడిచి వెళ్లారు. అనంతరం వాహనంలో ఇప్పటం చేరుకున్నారు.

‘‘మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేస్తున్నారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆర్కే ఇంటి దగ్గర రహదారి విస్తరణ లేదా? వైసీపీ వాళ్లకు ఇదే చెబుతున్నా.. ఇడుపలపాయలో హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరు.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. మేమేమన్నా గూండాలమా? మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు’’ అని పవన్ కల్యాణ్‌ విమర్శించారు.

మరోవైపు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. చిన్న గ్రామంలో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news