పవన్ కళ్యాణ్ ని బీజేపీ భయపెడుతోంది – మాజీ మంత్రి పితాని

-

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి తప్పుడు రాజకీయం చేస్తుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ టిడిపి తో కలవడానికి ముందుకు వస్తుంటే బిజెపి భయపెడుతుందన్నారు. టిడిపి పార్టీ తో జనసేన పార్టీని కలవకుండా బిజెపి ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు పితాని.

బిజెపి ముందు ఒక రాజకీయం, తెరవెనుక మరో రాజకీయం చేస్తుందని మండిపడ్డారు పితాని సత్యనారాయణ. రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి, దేశానికి బిజెపి అవసరమా..? అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు. మూడు రాజధానుల పై బిజెపి ఒకసారి అవునంటుంది, మరోసారి కాదంటుందని ధ్వజమెత్తారు. పితాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news