ప్రధాని మోడీకి చెప్పకుండానే..వైసీపీని దెబ్బ కొడతా – పవన్‌ కళ్యాణ్‌

-

 

ప్రధాని మోడీకి చెప్పకుండానే..వైసీపీని దెబ్బ కొడతానని పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 2024 ఎన్నికలు కీలక ఎన్నికలని… నేను ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పనన్నారు. 2014 నుంచి వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీని కలిశానని..ప్రధానితో నేనేం మాట్లాడానో సజ్జలకు ఎందుకు..?అని ప్రశ్నించారు.

ప్రధానితో నేనేం మాట్లాడానో తెలుసుకోవాలంటే నా దగ్గరకు రా చెవిలో చెబుతానని..వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీకి చెప్పి చేయను.. నేనే కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు.

నా యుద్దం నేనే చేస్తా.. ఢిల్లీ వెళ్లి చెప్పనని.. నేను అధికారం లేని వాడిని.. నా మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తారని నిలదీశారు. ఇప్పటం గ్రామానికి వస్తే.. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెట్టారని.. కారులో వద్దన్నారు.. నడవద్దన్నారు.. నాకు తిక్క వచ్చి కారెక్కా. 175 స్థానాలకు.. 175 స్థానాలు మీకొచ్చేస్తే.. మేం చూస్తూ కూర్చొంటామా..? అని ఆగ్రహించారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news