పవన్ కళ్యాణ్ ప్రజా ద్రోహి : భూమన కరుణాకర్‌

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌లపై టీటీడీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్జి తీవ్రంగా విరుచుకుపడ్డారు.తిరుపతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి దొంగలు పడ్డారంటూ అన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో, అదే ఏడాది నుంచి తాను రాజకీయాలు ప్రారంభించానని భూమన కరుణాకర్‌ రెడ్డి ఎద్దేవ చేశారు.

పవన్ కళ్యాణ్ సంస్కార హీనుడని ఆయన అన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే మాకు ఓటు వేయొద్దని.. అభివృద్ది చూసి ఓటు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు.

45 సంవత్సరాల కిందట రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించినందుకు ఓటు వేయాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచింనందుకు ఓటు వేయాలని అడుగుతున్నామని అన్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఏ విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని సవాల్ విసిరారు.చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. పవన్ కళ్యాణ్ ప్రజా ద్రోహి అంటూ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news