బీసీ లు బలపడితేనే రాజ్యాధికారం వస్తుంది: పవన్ కళ్యాణ్

-

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా ఓటు బ్యాంకు ను సంపాదించాలన్న కృతనిశ్చయంతో పని చేస్తున్నాడు. ఈ రోజు భీమవరంలో ఉన్న శెట్టి మరియు బలిజ వర్గాల కార్యకర్తలతో సమావేశం అయ్యాడు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుండి దూరం చెయ్యాలని బీసీ నేతలకు పిలుపునిచ్చాడు. రాజ్యాధికారం రావాలంటే అది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లు అందరూ ఏకం అయితేనే సాధ్యం అవుతుందన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ బీసీ లలో ఐక్యత చాలా తక్కువగా ఉంటుందని.. ఇందులో మీరు ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మీరందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపిస్తే… శెట్టి బలిజలు అభివృద్ధికి నేను తోడుగా ఉంటానని మాటిచ్చారు మరియు శెట్టి బలిజలను గౌడ్ లుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు.

మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా లేదా అన్నది తెలియాలంటే ఇంకా ఆరు నెలలకు పైగానే ఎదురుచూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news