BRS అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ది చెందింది: మంత్రి కేటీఆర్

-

తాజాగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సభలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం BRS ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు.. అయితే ప్రజల సన్తోసాన్ని ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శించారు. తెలంగాణాలో మా BRS ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిందన్నారు. మనకు ప్రత్యేక తెలంగాణ రాక ముందు కేవలం హత్య రాజకీయాలే జరుగుతున్నాయి.. అభివృద్ధి ఊసేలేదు. కానీ నేడు రాష్ట్రంలో పరిస్థితి అలా లేదు. ఆ రోజుల్లో రాష్ట్రంలో కరెంట్ ఉంటేనే వార్త .. కానీ ఇప్పుడు కరెంట్ పోతే వార్త అయ్యే పరిస్థితి నెలకొంది.

మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని విపక్షాలు మా నాయకుడు మరియు సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తాము అంటూ మాట్లాడుతున్నారు. ఏ కారణం చేత కేసీఆర్ ను జైలుకు పంపుతారో చెప్పాలని సవాలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news