నేరస్థులకు కొమ్ముకాయండి.. మా గొంతు నొక్కేయండి – పవన్ కళ్యాణ్

-

నేరస్థులకు కొమ్ముకాయండి.. మా గొంతు నొక్కేయండని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నేతల అరెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ తాజాగా స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల ముందే ఖరారు చేశామని.. మా పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబుతుందా? అని నిలదీశారు. వైసీపీ మూడురాజధానుల కార్యక్రమానికి ముందే మా ప్రోగ్రాం ఖరారు చేశామని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌.

ప్రభుత్వంతో పోటీ మాకెందుకు. ఎన్నికల టైంలోనే పోటీ వుంటుందన్నారు. అధికారులు మామీద జులుం చూపించారు. ప్రభుత్వానికి అండగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే నాకు గౌరవం లేదన్న వ్యక్తి సీఎం. ఆయన దగ్గర మీరు పనిచేస్తున్నారని ఆగ్రహించారు.

మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారట అంటూ జనసేన కార్యకర్తలు ఫోన్లు చేశారు. నన్ను లిఫ్ట్ చేయాల్సిన అవసరం వుంది. మేం ఏమన్నా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. గంజాయి సాగు చేసేవారిని వదిలేయండి. దేశంలోనే మొదటి స్థానంలో వుంది. సామాన్యుల గొంతు వినిపించడానికి వచ్చిన జనసేనను ఇబ్బంది పెట్టండి. దోపిడీదారులకు, నేరస్థులకు కొమ్ముకాయండి.. ప్రజాసమస్యలు వినిపించేవారి గొంతు నొక్కేయండని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news