దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్..కూతురు ఆద్యతో కలిసి!

-

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవీ శరన్నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా తన కూతురు ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 7వ రోజైన బధవారం అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇదిలాఉంటే ఉదయం 9 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్.. రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. కాగా, బుధవారం సీఎం చంద్రబాబు కూడా దుర్గమ్మను దర్శించుకోనున్నారు.కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నానికి బెజవాడ చేరుకోనున్నారు. సుమారు 2 గంటల సమయంలో ఇంద్రకీలాద్రి చేరుకుని సరస్వతీ స్వరూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news