పవన్ కళ్యాణ్ అన్ స్టాప్ అబుల్ కు రావడం రాజకీయకోణం అనుకుంటే పిచ్చితనమే.. తమ్మా రెడ్డి

-

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ బాలకృష్ణ పై వైరల్ కామెంట్స్ చేశారు తాజాగా బాలకృష్ణ షో కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంలో అస్సలు రాజకీయ కోణమే లేదంటూ చెప్పుకొచ్చారు..

టాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వజా ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు.. అలాగే ఇప్పటికీ ఈయన పలు వివాదాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అలాగే తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోపై కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఈ షోకు పవన్ కళ్యాణ్ రావాటానికి.. వచ్చే ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు..

ఈ విషయంపై మాట్లాడిన తమ్మారెడ్డి.. “చంద్రబాబు నాయుడు మంచి స్కీమర్. బాలకృష్ణకి అంత స్కీములు, గీములు ఏమీ ఉండవు. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. మనసులో ఉన్నది బయటపెట్టేసే మనిషి ఆయన. ఆయన పబ్లిక్‌లోకి తీసుకొచ్చి రాజకీయం గురించి మాట్లాడతారు అనేది అనుకునేవాళ్ల అమాయకత్వం. పవన్ కళ్యాణ్‌తో రాజకీయం చేయాల్సింది ఎవరు.. చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోపల కూడా బాలకృష్ణ రాజకీయం చేస్తున్నారంటే నేను నమ్మను. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ కాంటాక్ట్‌లో ఉంటున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు.. మొన్న కూడా పవన్ దగ్గరకి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news