పవన్ కళ్యాణ్ కు గాయం… ఆందోళనలో జనసేన నేతలు

-

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో పవన్ కల్యాణ్ విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

నిన్న(సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అయితే ఫ్యాన్స్ సెల్పీలు దిగే సమయంలో పవన్ కాలి బొటన వేలికి గాయం అయినట్లు తెలుస్తోంది.నిన్న(సోమవారం) రేణిగుంట విమానాశ్రయానికి కాలికి కట్టుతో పాటే పవన్ వచ్చారు. ఈ ఫొటో నెట్టింట్లా వైరల్ అయింది. అనకాపల్లి ఎన్నికల ప్రచార సభలోనే జనసేనాని కాలికి గాయం అయినట్లు సమాచారం. ప్రధాని సభ కావడంతో పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాలి వేలికి కట్టుతోనే నేడు తిరుపతిలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనాని కాలికి గాయం కావడంతో కూటమి నేతలు, ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news