ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో టీమిండియా న్యూ జెర్సీలు

-

టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం రిలీజ్ చేసింది. దీనిని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్, జెర్సీ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది.

దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో మంగళవారం నుంచి ఈ జెర్సీలు అందుబాటులో ఉంటాయని అడిడాస్ కంపెనీ ప్రకటించింది. జెర్సీలు రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్లేయర్స్ ఎడిషన్ ధర రూ.5,999గా ,ఫ్యాన్ ఎడిషన్ ధర 999 రూపాయలుగా నిర్ణయించారు. అయితే, ఈ ధరలు ఇంటర్నెట్ వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలకు కారణమయ్యాయి. టీ షర్టుల కోసం ఎదురు చూస్తున్నామని కొందరు, ధర కాస్త ఎక్కువైందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ధర కంటే విమాన టికెట్ ధర ఒకరకంగా తక్కువే అంటూ సెటైర్స్ వేస్తున్నారు.కాగా, హెలికాప్టర్ సహాయంతో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జెర్సీని సోమవారం ప్రత్యేకంగా ఆవిష్కరించారు. T 20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 2న అమెరికా, వెస్టిండీస్ మధ్య మొదలు కానుంది. జూన్ 5న ఐర్లాండ్‌ తో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news