గ్రేటర్ : బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు, పవన్ కీలక ప్రకటన

-

గ్రేటర్‌ ఎన్నికల అంశంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసారు. బీజేపీకి జనసేన పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన ప్రకటించారు. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పవన్ కోరారు. సమయం లేకపోవడం, కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల పొత్తు కుదర లేదని అయన అన్నారు. ఇక ఏపీ, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో బలమైన నాయకత్వం ఉండాలని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌ ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ లు కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలే కాదు, భవిష్యత్ ఎన్నికల్లోనూ కలిసే ఉంటామని ఆయన అన్నారి. ఈ విషయంలో జనసేన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు కానీ విశాల హృదయం తో కార్యకర్తలు సహకరించాలని అన్నారు. మోడీ నాయకత్వంలో అభివృద్ధి ఖాయమన్న అన్న ఆయన రెండు పార్టీల మధ్య గ్యాప్ కు, కారణం, తక్కువ సమయం వల్లేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news