సైదాబాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

-

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల గిరిజన బాలిక బలైపోయిన సంగతి తెలిసిందే. సినిమా హీరో కు జరిగిన ప్రమాదాన్ని టీఆర్పీ రూపం లో క్యాష్ చేసుకునే పని లో మీడియా బిజీ అయిపోవడం తో.. బయట ప్రపంచానికి ఈ దారుణ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మాములు ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ దాడికి పాల్పడిన నిందితుడి పై తీవ్ర స్థాయి లో మండి పడుతున్నారు.

pawan kalyan

అంతేకాదు సినిమా స్టార్లు కూడా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఇప్పటికే హీరో మంచు మనోజు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యం లోనే తాజాగా ఆ ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన తోటి గ్రేటర్ కమిటీ సభ్యులు మరియు జనసేన శ్రేణులు అందరూ రావాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ కేంద్ర కార్యాలయం నుండి.. సింగరేణి కాలనీకి బయలు దేరునున్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news