టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..

-

ఆంధ్రప్రదేశ్ పీఏసీ కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో పీఏసీ భేటీ జరుగుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు.

వైద్య చికిత్స అనంతరం ఆయన కొంతమేర కోలుకున్నారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు మెరుగైన వైద్యం కోసం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news