పయ్యావుల అందుకే మాట్లాడటం లేదా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావట్లేదు. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బయటకు రాకపోవడంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడుని ఆయన హైదరాబాదులో కలిసారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఆయన నియోజకవర్గంలో తిరిగి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గంలో నేతలతో మాట్లాడటం గాని… నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఆయన దూకుడుగా ముందుకు వెళ్లడం గాని చేయడం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక గట్టిగా మాట్లాడే నేత అయినా సరే ఆయన ఇప్పుడు బయటకు రాకపోవడం పట్ల అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన బయటకు రావడం లేదని ముఖ్యమంత్రి జగన్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఉన్న కొంతమంది కీలక నేతలు వలన ఇబ్బంది పడుతున్నారని అందుకే సైలెంటుగా ఉంటున్నారని మరి కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news