ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ – సీఎం కేసీఆర్

-

ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా, గోల్కండ కోటలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతుంది. కేంద్రంలోని వారు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అనే పథకాన్ని గొప్పగా అమలు చేస్తోందని వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆర్థిక రంగంలో దూసుకు పోవడంతో పాటు అన్నపూర్ణగా మారిందన్నారు. రాష్ట్రం అపూర్వ విజయాలను సాధిస్తోంది. హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చగా మారిందని వెల్లడించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news