జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారు : సజ్జల రామకృష్ణారెడ్డి

-

ప్రభుత్వం పథకాల లబ్ధిదారులే వైసీపీకి రెండోసారి విజయం కట్టబెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వారం రోజుల తర్వాత రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పీడ విరగడవుతుందని పేర్కొన్నారు. ఈసీ … చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎలక్షన్ ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని తెలిపారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు .తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ చీఫ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news