సినీ ప్రముఖులతో పేర్ని నాని చర్చలు ప్రారంభం.. హాజరైంది వీరే !

-

అమరావతి : సినీ ప్రముఖులతో మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పలువురు సిని నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా దిల్ రాజు, దేవినేని ప్రసాద్, అలంకార్ ప్రసాద్, డివివి దానయ్య, సి కళ్యాణ్, అదిశేషగిరావు తదతరులు హాజరయ్యారు. ఆన్ లైన్ విధానం ద్వారా టిక్కెట్ల అమ్మకంపై ఈ సమావేశం లో చర్చ జరుగుతోంది.

మెజార్టీ సినీ పెద్దలు ఆన్ లైన్లో టిక్కెట్ల విక్రయానికి మొగ్గు చూపు తున్నారన్న ప్రభుత్వం…. ప్రభుత్వ విధానాన్ని.. టిక్కెట్ల విక్రయం తర్వాత డబ్బును జమ చేసే విధానాన్ని వివరిస్తోంది. పన్నుల రూపంలో ప్రభుత్వాని కి రావాల్సిన దాన్ని మినహాయించుకుని రియల్ టైములోనే మనీ ట్రాన్సఫర్ చేస్తామని సిని ప్రముఖులకు స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే… పన్ను ఎగవేతకు.. బ్లాక్ టిక్కెట్ల దందాకు తెర పడుతుం దని వారికి వివరిస్తోంది ఏపీ సర్కార్. ఇక ఈ సమావేశం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news