తప్పు చేశారనే లెక్క తేలితే బొక్కలు పగులుతాయి !

-

దుర్గ గుడిలో ఏసీబీ సోదాలపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయం అని ఆయన అన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని, దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణం అని అన్నారు.

దుర్గ గుడి ఈవో తప్పు చేశారనే లెక్క తేలితే బొక్కలు పగులుతాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి  మీద చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ఓ చీఫ్ ఇంజినీరుపై ఏసీబీ దాడులు చేస్తే అప్పటి మంత్రి నారాయణకి వాటిని అంటగట్టగలరా..? అని ఆయన ప్రశ్నించారు. దుర్గ గుడిలో జరుగుతోన్న వ్యవహారాలను మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందిని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news