దారుణం: కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

-

కడప: రాయచోటిలో దారుణం జరిగింది. కుమార్తెపై తల్లిదండ్రులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రేమ వ్యవహారాన్ని పరువు‌గా భావించి కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుమార్తెపై కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ప్రేమ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నం చేశారు.

దీంతో కొద్దిరోజులుగా కుటుబసభ్యులతో యువతి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించారు. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురై కుమార్తె‌పై తల్లిదండ్రులు, సోదరుడుపెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు మంటలు ఆర్పివేశారు. క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 50 శాతంకు పైగా గాయాలయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news